వ‌రుణ్ తేజ్ క‌న్ఫ్యూజ‌న్.. ముందు ఎవ‌రు..?


ఏడాది కింది వ‌ర‌కు అవ‌కాశాల కోసం చూసాడు వ‌రుణ్ తేజ్. ఒక్క సినిమా పూర్తైన‌ త‌ర్వాత మ‌రో సినిమా అంటూ ముందుకెళ్లాడు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. కేలండ‌ర్ మారేసరికి మ‌నోడి మార్కెట్ తో పాటు ఇమేజ్.. క్రేజ్ అన్నీ పెరిగిపోయాయి. ఫిదా.. వెంట‌నే తొలిప్రేమ విజ‌యాలు సాధించ‌డంతో వ‌రుణ్ తేజ్ కెరీర్ ఇప్పుడు టాప్ స్పీడ్ లో ఉంది. మీడియం బ‌డ్జెట్ సినిమాల‌కు ఇప్పుడు వ‌రుణ్ తేజ్ ప‌ర్ ఫెక్ట్ ఛాయిస్ అయ్యాడు.
దాంతో నిర్మాత‌లు ఇత‌డి కోసం క్యూ క‌డుతున్నారు. ఈ క్యూలోనే ముందు ఏ నిర్మాత‌ను తీసుకురావాలో అర్థం కాక క‌న్ఫ్యూజ్ అవుతున్నాడు మెగా ప్రిన్స్. ఇప్ప‌టికే ఘాజీ ఫేమ్ సంక‌ల్ప్ రెడ్డితో ఓ సినిమా చేయ‌బోతున్నాడు వ‌రుణ్ తేజ్. ఈ చిత్రాన్ని మే లో మొదలు పెట్టాల‌ని చూస్తున్నాడు వ‌రుణ్ తేజ్. స్పేస్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌బోయే సినిమా కాబ‌ట్టి ఆ మ‌ధ్య క‌జ‌కిస్థాన్ వెళ్లి జీరో గ్రావిటీలో శిక్ష‌ణ తీసుకున్నాడు వ‌రుణ్ తేజ్. రాజ‌వ్ రెడ్డి..
సాయిబాబా ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. వ‌రుణ్ తేజ్ కు జోడీగా లావ‌ణ్య త్రిపాఠి.. అదితిరావ్ హైద్రీ న‌టిస్తున్నారు. ఇక ఇదిలా ఉండ‌గానే ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్ ను కూడా మే లోనే మొద‌లు పెట్టాల‌ని చూస్తున్నాడు అనిల్ రావిపూడి. ఈ చిత్రంలో వెంక‌టేశ్ మ‌రో హీరోగా న‌టిస్తున్నాడు. ఇది కూడా అదే స‌మ‌యంలో మొద‌లైతే..
రెండింట్లో వ‌రుణ్ దేనికి ఓటేస్తాడో తెలియ‌దు. దిల్ రాజు కాబ‌ట్టి ముందు ఎఫ్ 2 వైపు వెళ్లేలా క‌నిపిస్తున్నాడు. పైగా సంకల్ప్ సినిమా గ్రాఫిక్స్ ఎక్కువ‌గా ఉంటుంది. దాంతో ఆ సినిమాను నెమ్మ‌దిగా పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు. మొత్తానికి ఈ కుర్రాడి క‌న్ఫ్యూజ‌న్ పోవాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here