నాంపల్లి తెలుగు యూనివర్సిటీలో తెలంగాణ ప్రెస్ అకాడమీ అధ్వర్యంలో అరుణ్‌సాగర్ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది .

ఈ సందర్భంగా ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా విభాగాలలో విజేతలకు అవార్డులు అందజేసారు. అరుణ్‌సాగర్ సాహితి 2017 అవార్డు గోరేటి వెంకన్న  అందుకున్నారు.
మంత్రి మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ అరుణ్ సాగర్ పేరుతో టీవీ5 యజమాన్యంవారు ఈ అవార్డు అందించడం ఆనందంగా  ఉందని అన్నారు.జర్నలిస్టులు మృతిచెందితే యాజమాన్యాలు తూతూ మంత్రంగా వ్యవహరిస్తారు కానీ టి.వి 5 వారు ఇలాంటి కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టడం మంచి పరిణామం అన్నారు. జర్నలిస్టులు తమ ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి అన్నారు. అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు తెలియజేసారు.
ప్రెస్ అకాడమీ ఛైర్మెన్ అల్లం నారాయణ మాట్లాడుతూ ఈ అవార్డుల ఎంపికకు సాక్షి దినపత్రిక ఎడిటోరియల్ బోర్డు డైరెక్టర్ కే రామచంద్రమూర్తి, నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే శ్రీనివాస్.. జ్యూరీ సభ్యులుగా వ్యవహరించారని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, శాసనమండలి విప్ పల్లారాజేశ్వర్‌రెడ్డి ,ఎం.ఎల్ ఏ వెంకటేశ్వర రెడ్డి గారు తదితరులు  పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here