వెంకీతో త్రివిక్ర‌మ్.. ఎన్నాళ్ల‌కెన్నాళ్ల‌కు..!


త్రివిక్ర‌మ్ తో వెంక‌టేశ్ మ‌ళ్లీ జ‌త క‌లుస్తున్నాడు. ఈ ఇద్ద‌రిది ఆల్రెడీ బ్లాక్ బ‌స్ట‌ర్ కాంబినేష‌న్. ద‌ర్శ‌కుడు అయిన‌ త‌ర్వాత వెంక‌టేశ్ తో త్రివిక్ర‌మ్ ప‌ని చేయ‌లేదు కానీ రైట‌ర్ గా ఉన్న‌పుడు మాత్రం మ‌ల్లీశ్వ‌రి, నువ్వు నాకు న‌చ్చావ్, వాసు సినిమాల‌కు క‌లిసి ప‌నిచేసారు. అయితే ద‌ర్శ‌కుడిగా మారిన త‌ర్వాత ఎందుకో ఈ కాంబినేష‌న్ క‌ల‌వ‌లేదు. వీలుకాలేదు కూడా. ప‌వ‌న్, మ‌హేశ్, బ‌న్నీ లాంటి స్టార్స్ కే త్రివిక్ర‌మ్ అంకితం అయిపోవ‌డంతో ఇత‌ర హీరోల‌కు చాన్స్ రాలేదు. కానీ ఇప్పుడిప్పుడే త్రివిక్ర‌మ్ రూట్ మారుస్తున్నాడు.
ప్ర‌స్తుతం ఈయ‌న ఎన్టీఆర్ తో అరవింద స‌మేత వీర‌రాఘ‌వ‌తో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే 30 శాతం పూర్త‌యింది. అక్టోబ‌ర్ లోపు ఈ చిత్రం పూర్తి కానుంది. ద‌స‌రాకు విడుద‌ల కానుంది కూడా. ఈ చిత్రం త‌ర్వాత‌ వెంట‌నే వెంక‌టేశ్ సినిమా ఉంటుంది. అప్ప‌ట్లో వెంకీ పుట్టిన‌రోజునే ఈ చిత్ర అనౌన్స్ మెంట్ వ‌చ్చింది కానీ అజ్ఞాత‌వాసి త‌ర్వాత ఆ సినిమా గురించి కూడా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. అజ్ఞాత‌వాసిలో ప‌వ‌న్ కోసం..
త్రివిక్ర‌మ్ కోసం గెస్ట్ రోల్ చేసాడు వెంకీ. ఇప్పుడు హీరోగానే త్రివిక్ర‌మ్ సినిమా చేయ‌బోతున్నాడు. వెంక‌టేశ్ తో లో బ‌డ్జెట్ లో సినిమా చేసి ఎక్కువ లాభాలు ఆర్జించాల‌ని ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్ర‌మ్. ఎలాగూ త్రివిక్ర‌మ్-వెంకీ అంటే క‌నీసం 40 కోట్ల మార్కెట్ వ‌ర్క‌వుట్ అవుతుంది. ఈ చిత్రాన్ని కూడా రాధాకృష్ణ‌నే నిర్మించ‌బోతున్నాడు. చూడాలి ఈ సినిమా ఎలా ఉండ‌బోతుందో ఇక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here