గీతాగోవిందం.. విజ‌య్ గ‌ట్టిగా ఫిక్స‌య్యాడు..!

ఏం ఫిక్స్ అయ్యాడు.. ఇంత‌కీ ఏ విష‌యంలో అనుకుంటున్నారా..? అర్జున్ రెడ్డితో మ‌నోడికి బోలెడు బోల్డ్ ఇమేజ్ వ‌చ్చింది. ఈయ‌న సినిమా అంటే ఇప్పుడు కుర్రాళ్ల‌కు పండ‌గే. వాళ్ల‌కు కావాల్సింది తెలుసుకుని మ‌రి త‌న క‌థ‌ల్లో ఉండేలా చూసుకుంటున్నాడు విజ‌య్. విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడు గీత‌గోవిందం అంటూ ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌లైంది.
ఇది చూసిన త‌ర్వాత కుర్రాడు మారిపోవాల‌ని బాగా ఫిక్స్ అయిపోయిన‌ట్లు అర్థ‌మ‌వుతుంది. దానికి త‌గ్గ‌ట్లే నేను మారిపోయాను మేడ‌మ్ అంటూ టీజ‌ర్ లో డైలాగ్ కూడా చెప్పాడు విజ‌య్. ఈ చిత్రానికి క్లీన్ యు స‌ర్టిఫికేట్ వ‌స్తుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. దానికి ప‌రుశురామ్ టేకింగ్ కూడా కార‌ణ‌మే. ఎందుకంటే శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు లాంటి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ త‌ర్వాత ఈయ‌న చేస్తోన్న సినిమా ఇది.
ఇప్పుడు టీజ‌ర్ చూసిన త‌ర్వాత కూడా ఇదే అనిపిస్తుంది.
కాస్త వ‌ర్జిన్ డైలాగుల‌తో ర‌చ్చ చేసినా కూడా ఇప్పుడు అంతా కూల్ గా వెళ్తున్న‌ట్లే అనిపిస్తుంది. ఎందుకంటే అర్జున్ రెడ్డికి నెగిటివ్ ఇమేజ్ ఎంత ప‌నికొచ్చిందో ఈ హీరోకు తెలుసు. అందుకే ప్ర‌మోష‌న్ కోసం కొత్త‌గా ఆలోచిస్తున్నాడు ఈ కుర్ర హీరో. ఆగ‌స్ట్ 15న సినిమా విడుద‌ల కానుంది. మొత్తానికి టీజ‌ర్ తో ఈ చిత్రంపై అంచ‌నాలు మ‌రింత పెరిగిపోయాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here