తాంత్రిక పూజలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం:ఈవో సూర్యకుమారి


దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరుగుతున్నాయి అన్న వివాదం అందరికి తెలిసందే. అయితే ఈ ఘటన పై ప్రాథమిక విచారణ జరిపిన ఈవో సూర్యకుమారి నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. నివేదిక సారాంశం మాట్లాడుతూ ఆలయంలో ప్రధాన అర్చకుడు బద్రినాథ్‌, ఇద్దరు సహాయకులు ఉన్నారని ఈవో అన్నారు. పార్థసారథి ఒక్కడే బయటి వ్యక్తిని, పూజల కోసం పిలిచారని ఎక్కడా చెప్పలేదన్నారు. అంతరాలయంలో రోజూ చేసే అలంకారమే చేశారని ఈవో పేర్కొన్నారు. గుడిలో ఎలాంటి తాంత్రిక పూజలు జరగలేదన్నారు. ఆలయ ప్రతిష్టను దిగజార్చే చర్య ఎవరు చేసినా ఊరుకునేది లేదు అని హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here