మతాంతర వివాహం చేసుకున్న మహిళ తన సొంత మతాన్ని కోల్పోదు

భారత దేశపు రాజ్యాంగం ఎపుడు ఎలా ఎవరికి అనుగుణంగా తీర్పు వస్తుందో ఊహించలేరు.గూల్రోఖ్ ఎం.గుప్తా అనే పార్సీ మహిళ హిందూ వ్యక్తిని మతాంతర వివాహం చేసుకున్నారు. హిందూ వ్యక్తిని పెళ్లి చేసుకున్న పార్సీ మహిళ తన మతాన్ని కోల్పోయి, భర్త మత విశ్వాసాలకు చెందిన వ్యక్తి అవుతుందని 2010లో గుజరాత్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. గుప్తా దీనిని సవాలుచేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, గుప్తా తన తల్లిదండ్రులకు పార్సీ సాంప్రదాయంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు అనుమతించే విషయమై ‘వల్సద్ పార్సీ ట్రస్ట్’ తన అభిప్రాయం చెప్పాలని న్యాయస్థానం కోరింది.  కింది కోర్ట్ లో తనకు వేతిరేకంగా తీర్పు రాగ ఇప్పుడు సుప్రీమ్ కోర్ట్ లో తనకు అనుగుణంగా తీర్పు వచ్చింది. మతాంతర వివాహం చేసుకున్న తర్వాత… మహిళ తన సొంత మతాన్ని కోల్పోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆమె మతవిశ్వాసాలు భర్త మతంలో కలిసిపోతాయని ఏ చట్టమూ చెప్పలేదని పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టి ఈ తీర్పు ఇచ్చారు. భిన్న భాషలు భిన్న మతాలు ఉన్న మన దేశం లో ఇలాంటి కేసులు ఈ  మధ్య ఎక్కువగా రావడం గమనార్గహం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here